ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!
on Aug 30, 2024
ప్రస్తుతం 'దేవర', 'వార్-2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది.
క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మూవీ 'మత్తు వదలరా-2'. తాజాగా జరిగిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత రవిశంకర్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని, ఎన్టీఆర్ డిసెంబర్ నుంచి షూట్ పాల్గొంటారని రవిశంకర్ తెలిపారు.
గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' కోసం ఎక్కువ సమయం తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పటినుంచి ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న 'దేవర' విడుదలవుతుంది. 'వార్-2' షూటింగ్ దశలో ఉంది. ఇది 2025 ఆగస్టులో రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ 2026 జనవరిలో థియేటర్లలో అడుగు పెట్టనుంది.
Also Read