రూ.50 కోట్ల కబ్ల్... ఎన్టీఆర్ కి సాధ్యమేనా??
on Feb 18, 2015
బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్ సర్వసాధారమైపోయింది. ఓ మాదిరి సినిమా కూడా తొలి రెండు మూడు రోజుల్లో వంద కోట్ల మైలు రాయిని చేరుకొని జెండా ఎగరేస్తోంది. బాలీవుడ్ సినిమాకి అంతర్జాతీయంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి వంద కోట్లు పెద్ద విషయం ఏమీ కాదు. బాలీవుడ్ లొ వంద కోట్లు ఎలానో, టాలీవుడ్లో రూ.50 కోట్ల క్లబ్ కూడా అంతే. రామ్చరణ్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ... వీళ్లందరూ రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయారు. మిగిలింది ఎన్టీఆర్ ఒక్కడే. బాద్ షా ఈ మైలు రాయికి ఇంచుమించు దగ్గరగా వెళ్లింది. ఆ తరవాత ఎన్టీఆర్ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ని మూటగట్టుకోవడంతో రూ.30 కోట్లు కూడా దక్కించుకోలేదు. టెంపర్తో ఆ ఆశ నెరవేరుతుందని భావించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తొలి రోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కనీసం రూ.70 కోట్లు సాధిస్తుందని లెక్కలు వేసుకొన్నారు. తీరా చూస్తే ఇప్పుడు రూ.50 కోట్ల మైలు రాయిని చేరుకోవడం కూడా కష్టతరంగా మారింది. రెండో రోజు నుంచీ వసూళ్లు అనూహ్యంగా పడిపోయాయి. ఆది వారం కూడా అంతంత మాత్రమే వసూలు చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.28 కోట్ల షేర్ సాధించిందని అంచనా. ఆ లెక్కన ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరుతుందా??అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి దాదాపుగా రూ.45 కోట్లు (వడ్డీలతో కలుపుకొని) అయ్యింది. కనీసం ఈ డబ్బులొచ్చినా అదే పది వేలు అనుకొంటోంది చిత్రబృందం. శాటిలైట్ రూ.7.5 కోట్లకు అమ్ముడుపోయింది. అదే.. లాభం అనుకోవాలి. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి దూరం అవ్వడం, రిపీటెడ్ ఆడియన్స్ లేకపోవడం టెంపర్కి శాపంగా మారింది. ఇక ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్లో చేరాలంటే ఎన్టీఆర్ అభిమానులే పూనుకోవాలి.