‘భీష్మ’ నుండి ‘రంగ్ దే’కి వచ్చేశాడు
on Feb 12, 2020
ఈ ఏడాది ఏప్రిల్ 16న నితిన్ ఏడడుగులు వేయబోతున్నాడు. పెళ్లికి పది, పదిహేను రోజుల ముందే చేతిలో ఉన్న సినిమా షూటింగులను వీలైనంత వరకూ పూర్తి చేయాలని ఫిక్సయ్యాడట. ఫిబ్రవరి 21న ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ విడుదల కానుంది. ఓ వారం క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అది పూర్తయిన వెంటనే రెస్ట్ ఏమీ తీసుకోలేదు. ‘రంగ్ దే’ సెట్స్లోకి అడుగుపెట్టాడు. వరుణ్తేజ్తో ‘తొలిప్రేమ’, అఖిల్తో ‘మిస్టర్ మజ్ను’ తీసిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. నితిన్, కీర్తిపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘భీష్మ’ నుండి ‘రంగ్ దే’ మోడ్లోకి నితిన్ వచ్చేశాడు. ఈ సినిమా పూర్తి కాగానే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ చేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ చాలావరకూ చేశారు.