మహేష్ మేనల్లుడి సినిమాకు కోటి తీసుకుంటుందట!
on Nov 9, 2019
సక్సెస్లో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి. హీరోయిన్లు బలంగా నమ్మే సూత్రమిది. దీన్ని నిధి అగర్వాల్ బాగా వంటబట్టించుకుందని ఫిలింనగర్ గుసగుస. పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్'తో ఈ అమ్మడికి ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. అంతకు ముందు 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' ప్లాప్స్ అనే సంగతిని ప్రేక్షకులు మర్చిపోయారు. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్కి తోడు ఎప్పటికి అప్పుడు ఇన్స్టాగ్రామ్లో హాట్ హాట్ ఫొటోలు అప్లోడ్ చేస్తుంటుంది. యూత్లో ఆమెకు ఫాలోయింగ్ బావుంది. అందుకని, ఆమె రెమ్యూనరేషన్ పెంచేసింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కోటి డిమాండ్ చేస్తుందట. ఆమె అడిగినంత ఇవ్వడానికి మహేష్ బాబు పెద్దక్క సరే అన్నారట. మహేష్ బాబు మేనల్లుడు, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. కుమారుడి తొలి సినిమాను పద్మ (మహేష్ పెద్దక్క) నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఓపెనింగ్ జరగనుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాకు ఆమె అక్షరాలా కోటి రూపాయలు తీసుకుంటుందట. అదీ సంగతి.