డ్రగ్ కేస్: త్వరలోనే రకుల్, సారాలకు సమన్లు.. ధ్రువీకరించిన ఎన్సీబీ!
on Sep 15, 2020
సుశాంత్సింగ్ రాజ్పుత్-రియా చక్రవర్తి డ్రగ్ కేసు కొన్ని పేరుపొందిన బాలీవుడ్ పేర్లను బయట పెట్టింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జరుపుతున్న ఇంటరాగేషన్లో టాలీవుడ్లోనూ అగ్రతార అయిన రకుల్ప్రీత్ సింగ్తో పాటు, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లు వెల్లడయ్యాయి. సుశాంత్సింగ్ గెస్ట్ హౌస్, పావనా డ్యామ్ ఐలాండ్లో జరిగిన పార్టీలపై ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. కాగా రకుల్, సారా, సిమోన్లకు ఇంకా సమన్లు పంపలేదని ఎన్సీబీ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇండియా టుడేతో ఎన్సీబీ డిప్యుటీ డైరెక్టర్ మాట్లాడుతూ రకుల్, సారా, సిమోన్ల విషయంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకైతే సమన్లు పంపలేదు కానీ రానున్న రోజుల్లో వారికి సమన్లు పంపుతాం అని ఆయన ధ్రువీకరించారు. సుశాంత్, ఇతరులను తన మోటార్బోట్లో పావనా డ్యామ్కు తీసుకువెళ్లిన బోట్మన్ స్టేట్మెంట్ను ఎన్సీబీ రికార్డ్ చేసింది.
ఆ స్టేట్మెంట్ ప్రకారం సుశాంత్తో ఆ పార్టీలకు రియా చక్రవర్తి పలుమార్లు రాగా, సారా అలీఖాన్ నాలుగైదు సార్లు వచ్చింది. అంతేకాదు, సుశాంత్తో కలిసి శ్రద్ధా కపూర్ సైతం ఆ పార్టీలకు వచ్చిందని ఆ స్టేట్మెంట్ తెలిపింది.
Also Read