మత మార్పిడిపై సమంత సీరియస్
on Oct 1, 2016
ఇటీవల నాగార్జున సమంత - నాగచైతన్యలకు ప్రత్యేక పూజలు చేయించారు. వాటికి సంబంధించిన ఫొటోలూ ఆన్లైన్లో హల్ చల్ చేశాయి. సమంత మతం మార్చుకొందని, ఆ పూజలు అందుకోసమే అన్న టాక్ వినిపించింది. వ్యవహారం చూస్తుంటే.. అది నిజమే అనిపించింది కూడా. దాంతో మీడియా అంతా సమంత మతం మార్పిడిపై కథనాలు ప్రచురించింది. వీటిపై సమంత సీరియస్ అవుతున్నట్టు టాక్. `నేను మతం మార్చుకోవడం ఏంటి.. నాన్సెన్స్` అంటూ సన్నిహితుల దగ్గర వాపోతోందట. అంతేకాదు.. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని చూస్తోందట. అందుకే తన పెళ్లి పూర్తిగా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరపాలని కోరుకొంటోందని తెలుస్తోంది. ఈ విషయమై సమంత నాగ్ అనుమతి కూడా తీసుకొందట.
సమంత - చైతూల పెళ్లి ఓ చర్చ్ లో జరగబోతోందని, ఆ తరవాతే హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తారని ఓ ప్రచారం ఊపందుకొంది. సమంత కూడా... దానికే కట్టుబడి ఉందని తెలుస్తోంది. తనపై వచ్చిన మత మార్పిడి ముద్రని... ఈ పెళ్లితో చెరిపివేసుకోవాలని చూస్తోంది సమంత. మరోవైపు నాగార్జున కూడా సమంత ఏం అడిగితే అది చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నార్ట. కోడలంటే నాగ్కి ఎంత అభిమానం, గౌరవం, ఎక్సెట్రా.. ఎక్సెట్రానో కదూ..!