సంక్రాంతి బరిలో నాగచైతన్య?
on Jun 29, 2020
అక్కినేని కుటుంబానికి, సంక్రాంతి సీజన్కి మంచి అనుబంధమే ఉంది. ఈ కుటుంబంలో తొలితరం కథానాయకుడైన అక్కినేని నాగేశ్వరరావు.. ఈ సీజన్లోనే తన మొదటి సినిమా ('ధర్మపత్ని' -1941) తో పలకరించారు. ఆపై సంక్రాంతి సమయంలో పలు విజయవంతమైన చిత్రాలతో అలరించారాయన. ఇక రెండో తరంలోనూ ఆయన తనయుడు నాగార్జున ఆ పరంపరని కొనసాగించారు. తన తొలి సంక్రాంతి చిత్రం ‘మజ్ను’ (1987) మొదలుకొని చివరి సంక్రాంతి చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’(2016) వరకు పలు సంక్రాంతి హిట్స్ అందుకున్నారు. అయితే.. మూడో తరంలో నాగచైతన్య, అఖిల్ వంటి ఇద్దరు యువ కథానాయకులు ఉన్నా వీరిద్దరూ ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో దిగనేలేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘మజిలీ’ (2019), ‘వెంకీమామ’ (2019) వంటి రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న నాగచైతన్య.. ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను చేస్తున్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని తొలుత 2020 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా ఎఫెక్ట్తో ప్లానింగ్ మారింది. ఇంకా కొంతమేర చిత్రీకరణ మిగిలి ఉండడంతో.. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకు సంక్రాంతి సీజన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. త్వరలోనే ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి.. తాతయ్య నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున బాటలోనే నాగచైతన్య కూడా సంక్రాంతి సీజన్లో మెమరబుల్ జర్నీని కొనసాగిస్తాడేమో చూడాలి. కాగా, ‘లవ్ స్టోరీ’లో చైతూకి జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.