శ్రీదేవిని చంపేశారంటూ బాంబు పేల్చాడు
on Mar 20, 2018
దుబాయ్ లో సన్నిహితుల పెళ్ళికని వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవి బాత్ టబ్ లో పడి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దుబాయ్ పోలీసులు ఈ కేసు ని క్లోజ్ చేసినప్పటికీ, మీడియా మాత్రం రక, రకాల కోణాల్లో ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కథనాలు ప్రచురించారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట శ్రీదేవి మృతిని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసారు. ఇంటర్నేషనల్ మీడియా, ఈ అతి పై విమర్శలు గుప్పించాయి. కొందరు, శ్రీదేవి మృతి పై విచారణ చేపట్టాలని పిటిషన్ వేసినప్పటికీ కోర్ట్ స్వీకరించలేదు.
మరో వైపు, బోనీ కపూర్ తన మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ తో శ్రీదేవి కూతుళ్ళని దగ్గర చేసే విధంగా అడుగులు వేస్తున్నాడని అంటున్నారు. మొన్నామధ్య, ఫ్యామిలీ లో అందర్నీ డిన్నర్ కి తీసుకెళ్లి ఈ వార్తలకి ఊతం ఇచ్చాడు బోనీ. దాదాపు, అందరూ శ్రీదేవి విషయం మరచిపోతున్న వేళ, ఒక ప్రముఖ వ్యక్తి పెద్ద బాంబు పేల్చాడు. ఒక పాపులర్ జ్యోతిష్కుడు శ్రీదేవి మృతి పట్ల సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఉగాది పంచాంగ శ్రవణం చెబుతూ, శ్రీదేవి ది సహజ మరణం కాదు అని. ఆమెకు అత్యంత దగ్గరి వాళ్ళు మర్డర్ చేయించారని ఆరోపించారు.ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.