'బన్నీ'కి మల్టీ మిలియనీర్ ఊహించని గిఫ్ట్!
on Sep 29, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఓ మల్టీ మిలియనీర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బహుమతిగా ఇచ్చి బన్నీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేరళ మూలాలు ఉండి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ ఇటీవల యూఏఈలో అల్లు అర్జున్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన, బన్నీకి 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను గిఫ్ట్ గా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కాగా బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Also Read