ENGLISH | TELUGU  

మహేష్ బాబుకి ఈడీ నోటీసులు!

on Apr 21, 2025

 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య, సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది. 

 

ఈ రెండు సంస్థల నుంచి యాడ్స్ కోసం మహేష్ రూ.3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

 

మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.