ఒక్క ఏఎంబీ సినిమాస్లోనే రూ. కోటి కలెక్ట్ చేసిన 'లవ్ స్టోరి'
on Oct 20, 2021
శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరి' మూవీ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన సినిమాల్లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కుల వివక్ష, లైంగిక వేధింపుల అంశాలకు హృదయాన్ని స్పృశించే 'లవ్ స్టోరి'ని జోడించి ఈ మూవీని శేఖర్ కమ్ముల రూపొందించాడు.
ఈ మూవీ హైదరాబాద్లోని ఒక్క ఏఎంబీ సినిమాస్లో రూ. కోటి గ్రాస్ను వసూలు చేసి, సంచలనం సృష్టించింది. 251 షోలలో 48,233 మంది ఆడియెన్స్ చూడడం ద్వారా ఈ కలెక్షన్ వచ్చింది. ఈ విషయాన్ని తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పిక్చర్ను షేర్ చేయడం ద్వారా ఏఎంబీ సినిమాస్ వెల్లడించింది. "#LoveStory, Success Stories! On an average of 251 shows with an audience of 48,233 bringing in a gross collection of Rs. 1 crore has created a huge success story in itself! We congratulate the team for their hardwork and success!" అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు.
Also Read