నిన్న వెంకీ - మీనా.. నేడు నాగ్ - రమ్య!
on Jan 19, 2022
కొన్ని కాంబినేషన్స్ అంతే.. ఎన్ని సార్లు వెండితెరపై సందడి చేసినా.. మళ్ళీ మళ్ళీ చూడబుద్ధేస్తుంటుంది. అలాంటి జోడీలే.. విక్టరీ వెంకటేశ్ - అభినేత్రి మీనా, కింగ్ నాగార్జున - వెర్సటైల్ యాక్ట్రస్ రమ్యకృష్ణ. జట్టుకట్టిన ప్రతీసారి హిట్టు కొట్టే కాంబినేషన్ గా వెంకీ - మీనా జోడీ నిలిస్తే.. జయాపజయాలతో సంబంధం లేకుండా మెస్మరైజ్ చేస్తున్న పెయిర్ గా నాగ్ - రమ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు జోడీలు కూడా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉండడం విశేషం.
Also Read: ఈద్ స్పెషల్ః ఇక్కడ `ఎఫ్ 3`.. అక్కడ `హీరోపంతి 2`!
ఇదిలా ఉంటే.. ఈ వెటరన్ కాంబినేషన్స్ రీసెంట్ గా ఓ రేర్ ఫీట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. అదేమిటంటే.. సీక్వెల్స్ తోనూ సక్సెస్ చూడడం. 2014 నాటి `దృశ్యం`కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2`తో గతేడాది నవంబర్ లో వెంకీ - మీనా జోడీ సీక్వెల్ పెయిర్ గా సక్సెస్ చూస్తే.. 2016 నాటి సంక్రాంతి సెన్సేషన్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి కొనసాగింపు చిత్రంగా సేమ్ పొంగల్ సీజన్ లో రీసెంట్ గా సందడి చేసిన `బంగార్రాజు`తో నాగ్ - రమ్యకృష్ణ జంట సీక్వెల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. మొత్తంగా.. అటు వెంకీ - మీనా, ఇటు నాగ్ - రమ్య జంటలు సీక్వెల్ మూవీస్ తో సక్సెస్ చూసి మరోసారి వార్తల్లో నిలిచినట్లయ్యింది.
Also Read