లాస్ట్ సాంగ్ కోసం గోవా వెళ్తున్న రవితేజ, శ్రుతి
on Dec 3, 2020
మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తోన్న సినిమా 'క్రాక్'. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. గోవాలో శుక్రవారం (డిసెంబర్ 4) నుంచి ఆ పాటను రవితేజ, శ్రుతి హాసన్లపై చిత్రీకరించనున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవనున్నది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్'లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన "భూమ్ బద్దల్" అనే స్పెషల్ సాంగ్ బ్లాక్బస్టర్ హిట్టయింది.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'క్రాక్' మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read