ENGLISH | TELUGU  

‘కాంత’ వివాదం.. అందరి నోట ఒకటే మాట!

on Nov 12, 2025

 

- కోర్టుకెక్కిన త్యాగరాజ భాగవతార్ మనవడు

- కాంత వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

- కాంతపై సోషల్ మీడియాలో పోస్టులు

 

దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్‌ మీడియా బేనర్స్‌పై దుల్కర్‌ సల్మాన్‌, రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. 

 

‘కాంత’ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ ఓ వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవిత కథనే ‘కాంత’ చిత్రంగా మలిచారంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో త్యాగరాజ భాగవతార్‌ మనవడు ‘కాంత’ చిత్ర నిర్మాతలపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

 

నవంబర్‌ 14న ఈ సినిమా విడుదలవుతుండగా త్యాగరాజ భాగవతార్‌ మనవడు కోర్టుకెక్కడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇటీవల చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ బ్రిలియన్స్‌ విషయంలో పడిన గొడవల నేపథ్యంలోనే ఈ కథ ఉంటుంది తప్ప ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు అన్నారు. మరోపక్క ఈ సినిమా ప్రీమియర్స్‌ ఆల్రెడీ వేశారు. మీడియాకి కూడా సినిమాని చూపించారు. ‘కాంత’లో వివాదాస్పద అంశాలు ఏమీ లేవని సినిమా చూసిన వారు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. త్యాగరాజ భాగవతార్‌ జీవితానికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి జరిగిన ప్రచారం అర్థం లేనిదని తేల్చారు. దీంతో ‘కాంత’ వివాదానికి తెరపడినట్టుగానే భావించాలి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.