బ్యాన్ కు గురైన ఆర్టిస్ట్ ని తీసుకున్న ఎన్టీఆర్, రిస్క్ తీసుకుంటున్నాడా?
on Apr 6, 2017
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈసారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసే పనిలో ఉన్నాడు. తన తదుపరి చిత్రం జై లవ కుశ లో ఊహకి మించిన మలుపులుంటాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలు విభిన్నంగా ఉంటాయంటున్నారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ చేస్తున్న పాత్రలు వాటి స్వభావం తెలిపిన మోషన్ పోస్టర్ కి కూడా మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత వినూత్నమైన సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా ఎవరు చేయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం, కన్నడ వివాదాస్పద యాక్టర్ దునియా విజయ్ ని ఎన్టీఆర్ కి మెయిన్ విలన్ గా అనుకుంటున్నారని తెలిసింది. మస్తీ గుడి అనే సినిమా షూటింగ్ లో ఇద్దరు ఆర్టిస్ట్ లు చనిపోయిన సంఘటనలో, విజయ్ ని కొన్ని రోజులు కన్నడ చిత్ర సీమలో బ్యాన్ చేసారు. దీన్ని ఒక చిన్న విషయంగా పరిగణిస్తూ, జై లవ కుశ దర్శక, నిర్మాతలు విజయ్ ని అతి ముఖ్యమైన పాత్రకు తీసుకుంటున్నారు. ఇది ఏమైనా రిస్క్ తో కూడుకుందా అంటే, కాదు అనే చెప్పొచ్చు. ఆ దుర్ఘటనలో విజయ్ కావాలని చేసింది ఏం లేదు. అయినా, తన పై ఉన్న బ్యాన్ ని కూడా ఎత్తేసారు, సో ఏ రకమైన ఇబ్బందులు ఉండబోవు. చూద్దాం, విజయ్ తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తాడో. మరి ఎన్టీఆర్ కి విలన్ అంటే మామూలు విషయం కాదు కదా!