జపాన్ వెళ్లేముందు నీల్ తో ఎన్టీఆర్ భేటీ.. భయం కనిపిస్తుంది!
on Mar 23, 2025
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. (NTR Neel)
ఇటీవల హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన నీల్.. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్రేక్ లో ఎన్టీఆర్, నీల్ మీట్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోని నీల్ భార్య లిఖిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, వీరిద్దరినీ చూస్తే భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకొస్తుంది అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' మార్చి 28న జపాన్ లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం తాజాగా జపాన్ లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్.
మొత్తానికి ఓ వైపు వార్-2, దేవర షూటింగ్, మరోవైపు దేవర జపాన్ ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
