అమ్మ సమాధిని దర్శించిన త్రిష
on Dec 13, 2016

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని ఇంకా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. చాలా మంది తెరవేల్పులు అమ్మ మరణించిన రోజు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. హీరో అజిత్ అయితే ఏకంగా బల్గేరియా నుంచి షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకి చేరుకుని అమ్మ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ జాబితాలోకి త్రిష కూడా చేరింది. అమ్మతో తన అనుబంధానికి గుర్తుగా ట్విట్టర్ అకౌంట్ కవర్ ఫోటోలో జయతో పాటు దిగిన ఫోటోను ఉంచింది. అలాగే జయ చదివిన కాలేజీలోనో..స్కూల్లోనో నేను చదివాను అని గర్వంగా చెప్పేది...జయ బయోపిక్ తీస్తే అందులో నటిస్తానని చెప్పింది త్రిష. ఈ సందర్భంగా మెరీనా బీచ్లో జయ సమాధిని సందర్శించి నివాళులుర్పించింది. అంత్యక్రియల రోజున షూటింగ్లో ఉండటంతో హాజరుకాలేకపోయానని త్రిష తెలిపింది..కొద్దిసేపు సమాధి వద్ద కూర్చొని అమ్మను స్మరించుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



