ఆరేళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఇలియానా
on May 21, 2018
గోవా భామ ఇలియానా ఆరేళ్ల తర్వాత తెలుగులోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ అవకాశాలు దొరకడమే లేదో, టాలీవుడ్ మీద మనసే మళ్లిందో... కారణం ఏదైనా ఇలియానా తిరిగి ఓ తెలుగు సినిమా చేస్తోంది. అది కూడా రవితేజతో! రవితేజ హీరోగా అమర్ అక్బర్ యాంటోని అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా మొదటి అను ఇమాన్యూయేల్ని అనుకున్నారు. కానీ అను డేట్స్ కుదరకపోవడంతో... చిత్రబృందం ఇలియానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం రవితేజతో ఇలియానా కిక్లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు అదే జంట మీద అంచనాలు పెరిగిపోయే అవకాశం ఉంది.