పవన్ కళ్యాణ్ హరిహరవీర మల్లు టీజర్ విడుదల..అంతా చట్ట విరుద్ధమే
on May 2, 2024
ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ (pawan kalyan) కూడా ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు.ఇక ఫ్యాన్స్ కి అయితే మూవీకి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తెప్పిస్తుంది. అంతటి ఇమేజ్ కలిగిన పవన్ తన కెరీర్లోనే తొలిసారి హరిహరవీరమల్లు (Hari hara veera mallu) అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది. రావడమే కాదు విత్ ఇన్ సెకన్లలో సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. అలాగే ఎవరు ఊహించని ఒక న్యూస్ ని కూడా చెప్పింది
17వ శతాబ్దంలోని పేదలు దోపిడీకి గురవుతు, ధనవంతులు మరింతగా అభివృద్ధి చెందుతుంటారు.ఈ క్రమంలో పేద వారి తరుపున పోరాడే ఒక యోధుడుగా పవన్ హరిహర వీరమల్లు లో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. తన పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో రూపొందించిన టీజర్ ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుంది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం. రేపు థియేటర్లలో ప్రేక్షకుడు ఒక గొప్ప అనుభూతిని అర్ధం అవుతుంది మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపించారు. ఆహార్యం, అభినయంలో ఆ ఇద్దరూ కూడా తమ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇవే కాకుండా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఎన్నో అంశాలు టీజర్ లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన పోరాటం అనేది స్ఫూర్తిని కలిగిస్తోంది.
ఇక వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్ చేసే సాహసాలని చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ టీజర్ లోనే ప్రకటించారు. హరిహరవీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2024 చివర్లో విడుదల చేయనున్నట్టుగా కూడా ప్రకటించారు.
ఇక నిర్మాత ఏ ఎం రత్నం ఒక కీలక ప్రకటన చేసాడు. ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన జ్యోతి కృష్ణ (jyothi krishna) హరి హర వీర మల్లు యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తాడు. కాకపోతే క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలోనే చేస్తాడు. ఆయన గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలోను దర్శకుడుగా రచయితగా ఎన్నో హిట్ సినిమాలని అందించాడు. శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్ ల వంటి ఉద్దండులు ఫైట్స్ ని అందిస్తున్నారు.