బాలయ్యకు చరణ్ దొంగ దెబ్బ?
on Jan 4, 2017
``ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రావడం చిత్రసీమకు మంచిది కాదు. అందుకే మేం 11న వస్తున్నాం..`` అంటూ చరణ్ ప్రకటించేశాడు. దాంతో ఖైదీ నెం.150 రిలీజ్ డేట్పక్కా అయిపోయింది. బాలయ్య 12న వస్తున్నాడు కాబట్టి మేం 11న వస్తున్నాం.. అన్నది చరణ్ మాట. లేదంటే వాళ్లు కూడా 12నే వచ్చేవారట. ఒకే రోజు వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు రావడం ఎంత వరకూ సమంజసం?
అప్పుడు మాత్రం వసూళ్లు పంచుకొన్నట్టు కాదా, దాని వల్ల పరిశ్రమకు దెబ్బ పడదా? అనే చర్చ పక్కన పెడితే... చరణ్ రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో పక్కా ప్లాన్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కావాలనే ఓ రోజు ముందొచ్చి బాలయ్య సినిమాపై చరణ్ దొంగదెబ్బ కొట్టాడని నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నార్ట. విషయంలోకెళ్తే.. `మన సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేద్దాం` అంటూ చరణ్, క్రిష్ ఇద్దరూ మాట్లాడుకొన్నార్ట.
మీరు 12న వస్తే.. మేం 13న వస్తాం.. అని చరణ్ హామీ ఇచ్చాడని.. అందుకే గౌతమి పుత్ర 12న ఫిక్సయ్యిందని, చరణ్ ఆ హామీ ఇవ్వకపోతే.. గౌతమి పుత్ర కూడా 11నే రావాల్సిందని తెలుస్తోంది. గౌతమి పుత్ర రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయ్యాక మళ్లీ మాటమార్చి.. ఒక రోజు ముందు రావడం కష్టం. అది దృష్టిలో ఉంచుకొనే... 13న వస్తానని చెప్పిన ఖైదీ.. 11న షిఫ్ట్ అయ్యిందని, దాని వల్ల సంక్రాంతి బెనిఫిట్ ఎక్కువ పొందే ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు. ఎప్పుడైతే ఖైదీ రిలీజ్ డేట్ 11న అని ఫిక్సయ్యిందో.. క్రిష్పై ఒత్తిడి పెరిగిందని, బాలయ్య సినిమాని 11నే తీసుకురావాలని ఫ్యాన్స్ ఒత్తిడి పెంచారని, కానీ... అది సమంజసం కాదని క్రిష్ భావించడంతో 12నే సినిమాని విడుదల చేస్తున్నారని తెలుస్తోంది.