దర్శకుడి అవతారమెత్తిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి
on Sep 27, 2019
కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా మారి 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు ఒకేసారి రెండు కొత్త అవతారాలు ఎత్తుతున్నాడు. అవి.. దర్శకుడిగా, నిర్మాతగా! అవును. ఆయన దర్శకత్వంలో 'భాగ్యనగర వీధుల్లో.. గమ్మత్తు' అనే సినిమా రూపొందుతోంది. దీన్ని తన ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్పై స్వయంగా నిర్మిస్తున్నాడు.
ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తయారవుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, ధన్రాజ్, సత్యం రాజేశ్, రఘు కారుమంచి, నవీన్ నేని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' రైటర్ పరం సూర్యాంశు ఈ మూవీకి కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నాడు. సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా, భరణి కె. ధరన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ను శనివారం (సెప్టెంబర్ 28) ఆవిష్కరిస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు శ్రీనివాసరెడ్డి. 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అనే క్యాప్షన్ను ఈ మూవీ టైటిల్ లోగో పోస్టర్కు ఆయన జోడించాడు. దర్శకుడిగా శ్రీనివాసరెడ్డి తొలి యత్నం ఫలించాలని ఆయన శ్రేయోభిలాషులంతా ఆశిస్తున్నారు.