"నో హగ్స్, నో షేక్హ్యాండ్స్ మిత్రమా!".. చిరు చమత్కారం!
on Mar 28, 2020
ఉగాది సందర్భంగా మార్చి 25న మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఖాతాతో సోషల్ మీడియాలో అడుగుపెట్టిన విషయం మనకు తెలుసు. అప్పుడు "మిత్రమా! స్వాగతం" అని ట్వీట్ చేశారు డైలాగ్ కింగ్ మోహన్బాబు. దీనికి సరదాగా, "థాంక్యూ మిత్రమా మోహన్బాబూ.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?" అని రిప్లై ఇచ్చారు చిరంజీవి. తిరిగి దీనికి సమాధానంగా అప్పుడే "ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను" అని చెప్పారు మోహన్బాబు. ఉగాది రోజు వాళ్ల మధ్య ఈ సరదా సంభాషణ నడిచింది. అయితే మూడు రోజుల తర్వాత ఇప్పుడు మోహన్బాబు మాటలకు రెస్పాండ్ అయ్యారు చిరంజీవి.
"మిత్రమా... కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. నో హగ్స్.. నో షేక్హ్యాండ్స్.. వోన్లీ నమస్తే! సామాజిక దూరం తప్పనిసరి. మనవాళ్లను, మనకు కావాల్సిన వాళ్లను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి మన మంచు లక్ష్మి రూపొందించిన వీడియోను చూడు" అని సలహా ఇచ్చారు. "స్టే హోమ్ స్టే సేఫ్" అనే హ్యష్ట్యాగ్ను జోడించారు. అంతే కాదు, ఈ పోస్ట్ను మంచు లక్ష్మికి కూడా చిరంజీవి ట్యాగ్ చేయడం గమనార్హం.
కరోనా దెబ్బకు "ఆచార్య" సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో సినీ సెలబ్రటీలు అందరికంటే ఎక్కువ చురుగ్గా ఉంటూ, ఎక్కువ పోస్టులు పెడుతూ, ఎక్కువ సమయం కేటాయిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
Also Read