చిరంజీవి,పవన్ కళ్యాణ్ స్పెషల్ స్క్రీనింగ్ వైరల్..సైలెంట్ గా కానిచ్చేశారు
on Sep 30, 2025
.webp)
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ జి 250 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ని రాబట్టిందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
రీసెంట్ గా ఓజి స్పెషల్ స్క్రీనింగ్ హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్(Prasad labs)లో ప్రదర్శించడం జరిగింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వీక్షించడం జరిగింది. దర్శకుడు సుజీత్(Sujeeth)థమన్,నిర్మాత దానయ్య ,సినిమాటోగ్రాఫర్ రవికేచంద్రన్ సహా ఇతర ముఖ్యులు కూడా ఈ షో లో పాల్గొన్నారు. మూవీ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రత్యక్షమవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
'ఓజి' ఇప్పటికే 250 కోట్లని రాబట్టడంతో క్లోజింగ్ కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉంది. విజయదశమి ఫెస్టివల్ ఉండటం కూడా కలిసి వచ్చే అవకాశం. ఇటీవల ఓజి ని పైరసీ చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,నానితో పాటు పలువురు సినీనటులు హైదరాబాద్ పోలీసులతో భేటీ అయ్యి ధన్యవాదాలు తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



