దిల్ రాజు బాధ్యత తీసుకున్న వంశీ పైడిపల్లి
on Mar 22, 2017
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితి హైదరీ జంటగా నటించిన "కాట్రు వెలియదై" ను తెలుగులో చెలియా పేరుతో డబ్ చేస్తుండగా..దిల్రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో లాంచ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.. ఇలాంటి ఈవెంట్లను అదిరిపోయే రేంజ్లో చేస్తారని రాజుకు పేరుంది.. అందుకు తగ్గట్టుగానే దిల్రాజు పార్క్హయత్ హోటల్లో అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన ఎక్కడ కనిపించలేదు..కాని ప్రొగ్రామ్ సూపర్ సక్సెస్ అయ్యింది..దిల్రాజు లేకుండా ఇంత బాగా ఎలా జరిగింది అంటే అందుకు కారణం వంశీ పైడిపల్లి.
దిల్రాజు భార్య శ్రీమతి అనిత ఇటీవల గుండెపోటుతో మరణించారు..ఈ షాక్ నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు..ఎవరిని కలవకుండా..ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ముందుగానే చెలియా తెలుగు ఆడియో లాంచ్ను ప్లాన్ చేసుకోవడం..దిల్రాజు అందుబాటులో లేకపోవడంతో చిత్రయూనిట్ కాస్త ఆందోళనకు గురైంది..అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసే బాధ్యతను రాజు వంశీపైడిపల్లికి అప్పగించారు..ఆయన తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడియో లాంచ్ను అద్భుతంగా నిర్వహించారు వంశీ. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించడంతో పాటు అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. ఇది చూసిన వారు వంశీ లేకుంటే ఈ ప్రొగ్రామ్ జరిగేదే కాదు అని ప్రశంసలతో ముంచెత్తారు.