బిగ్ బాస్ 4: "నా ఫిగర్ను ఎత్తుకుపోతున్నాడు" అని గొడవచేసిన అమ్మ రాజశేఖర్!
on Sep 16, 2020
బిగ్ బాస్ హౌస్ లో క్రమంగా ఫన్ పెరుగుతూ వస్తోంది. రెండోవారం రెండో రోజు బిగ్ హౌస్ లోని సభ్యులు ఒకరిని మించి మరొకరు తమ ఫర్ఫార్మెన్స్ లతో బిగ్ బాగ్ ను, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డాన్స్ లతో దేత్తడి హారిక, కామెడీతో యాంకర్ దేవి, సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ ఫోజులతో దిల్ సే మెహబూబ్, స్టెప్పులతో అమ్మ రాజశేఖర్, గోరు ముద్దలతో అఖిల్, హారిక, పెద్దరికంతో గంగవ్వ, గయ్యాళీ తనంతో కళ్యాణీ వినోదాన్ని పంచారు. బిగ్ బాస్ 4 సీజన్ లోని బిగ్ హౌస్ 9వ రోజు మంగళవారం ప్రసారమైన పదో ఎపిసోడ్ పసందుగా సాగింది.
అఖిల్ పులిహోర బాగా కలుపుతాడని , సోహైల్ తాళింపు వేస్తాడని దివి కామెంట్ చేసింది. కిచెన్ లో వంట, సరుకుల గురించి హౌస్ కెప్టెన్ లాస్య, యాంకర్ దేవి మధ్య కొంత చర్చ జరిగింది. కిచెన్ లో కొంతమందే పనిచేస్తుండటంతో మిగతావారికి ఏమీ తోచడం లేదని, అందరూ పనిచేసేలా చూడాలని దేవి సూచించింది. హౌస్ లో దివిని మెహబూబ్ ఎత్తుకుని తీసుకెళ్ళడం చూసిన రాజశేఖర్ "నా ఫిగర్ ను ఎత్తుకు పోతున్నాడు" అంటూ కామెంట్ చేశాడు. "ఎవరినీ వదలవా.. ఈ అమ్మాయిలను కాదు కరాటే కళ్యాణిని ఎత్తుకో" అంటూ సెటైర్ వేస్తూ హౌస్ లో నవ్వులు పండించారు. కరాటే కళ్యాణితో కలిసి రాజశేఖర్ రొమాంటిక్ సీన్స్ క్రియేట్ చేశారు. వాటిని కంటెస్టెంట్లు ఎంజాయ్ చేశారు.
Also Read