బిగ్ బాస్ 4: మోనాల్, అభిజిత్, అఖిల్.. ఒక 'ప్రేమదేశం'!
on Sep 17, 2020
బిగ్ బాస్ హౌస్ లో పదోరోజు ఉదయమే వేకప్ సాంగ్ గా "ఎవడు కొడితే.." పాటకు స్పెప్పులేశారు. ఆ తర్వాత అఖిల్, కళ్యాణి కిచెన్ లో దోశలు వేయడంలో బిజీగా మారారు. అభిజిత్ , మోనాల్ కూర్చోని మాట్లాడుతుంటే మోనాల్ కు అఖిల్ టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చాడు. టిఫిన్ తింటూ పొలమారిన మోనాల్ కు నీళ్ళు తీసుకురావడానికి అభిజిత్ వెళ్లగా అప్పటికే బాటిల్ లో నీళ్ళు పడుతూ కనిపించాడు అఖిల్. "ఇస్తున్నావా?" అంటూ అభి అడిగినా అఖిల్ సమాధానం చెప్పకుండా నీళ్ల బాటిల్ మోనాల్ కు ఇచ్చాడు.
మోనాల్ తో అఖిల్ మాట్లాడుతున్న సమయంలో మోనాల్ పదేపదే కెమెరాల వైపు చూసింది. దాంతో అఖిల్.. "ఇది రియాల్టీ షో.. కెమెరాలు అలాగే ఉంటాయి. నువ్వు వాటిని చూడటం మానుకో. ఆలోచించి మాట్లాడు. ఇతరులు అన్నవి నాకు తీసుకొచ్చి చెప్పకు. నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు. నేను అన్నింటికీ ఫీల్ అవుతాను. నేను నాలాగే ఉంటాను. రోజంతా నవ్వుతూ ఎవడూ ఉండడు. అలా ఉంటే పిచ్చోడు అంటారు" అంటూ మోనాల్ కు క్లాస్ పీకాడు.
అఖిల్, మోనాల్, అభిజిత్ మధ్య సాగుతున్న సంభాషణలు వారి ముగ్గురి ప్రవర్తన 'ప్రేమదేశం' సినిమాను గుర్తు చేస్తున్నాయి. అబ్బాస్, వినిత్ మధ్య నలిగిపోయిన టబూ పాత్రలో మోనాల్ కనిపిస్తోంది. అభిజిత్, అఖిల్ లను బాధపెట్టలేక ఇద్దరితో టైమ్ స్పెండ్ చేస్తూ ఇబ్బంది పడుతోంది.