జనవరి 14 స్పెషల్.. ఒకే ఏడాదిలో ఒకేరోజున బాలయ్య, ప్రభాస్ బ్లాక్బస్టర్స్!
on Jan 15, 2022
ప్రతీ సంక్రాంతి సీజన్ లోనూ రెండు అంతకుమించి సినిమాలు విడుదలవడం సర్వ సాధారణమే. అయితే, ఒకేరోజు విడుదలైన రెండు సంక్రాంతి చిత్రాలు ఆ యేటి మేటి బ్లాక్బస్టర్స్ గా నిలవడం అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలిచింది 2004 జనవరి 14. ఆ రోజు విడుదలైన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి. ఆ చిత్రాలే.. `లక్ష్మీ నరసింహా`, `వర్షం`.
తమిళ చిత్రం `సామి` (2003) ఆధారంగా నటసింహ నందమూరి బాలకృష్ణ, అసిన్ కాంబినేషన్ లో జయంత్ సి. పరాన్జీ రూపొందించిన కాప్ డ్రామా `లక్ష్మీ నరసింహా`. జనవరి 14న జనం ముందు నిలిచిన ఈ రీమేక్.. సంచలన విజయం సాధించింది. ఇక అదే రోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా శోభన్ తెరకెక్కించిన `వర్షం` కూడా వసూళ్ళ వర్షం కురిపించి ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్బస్టర్ గా నమోదయింది. త్రిషని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. అటు `లక్ష్మీ నరసింహా`కి మణిశర్మ సంగీతం ఎస్సెట్ గా నిలవగా.. ఇటు `వర్షం`కి దేవి శ్రీప్రసాద్ బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి.
Also read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ
ఇక ఈ రెండు సినిమాల్లోనూ ప్రకాశ్ రాజ్, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జున రావు, రఘుబాబు వంటి నటులు కామన్ గా ఉండడం గమనార్హం. అలాగే ఈ రెండు చిత్రాలకూ పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించడం మరో విశేషం. గమ్మత్తు ఏంటంటే.. `లక్ష్మీ నరసింహా` ఒరిజనల్ వెర్షన్ `సామి`లో హీరోయిన్ అయిన త్రిష.. ఇక్కడ రీమేక్ మూవీకి పోటీగా నిలిచిన `వర్షం`లో నాయిక.
Also read: జనవరి 13.. నందమూరి మూడు తరాలకు అచ్చొచ్చిన తేది!
మొత్తమ్మీద.. 2004లో ఒకే రోజు (జనవరి 14) బాలయ్య, ప్రభాస్ ఇద్దరు కూడా ఆ యేటి మేటి బ్లాక్ బస్టర్స్ అందుకోవడం ఓ రేర్ రికార్డ్ గా నిలిచిపోయింది.
Also Read