నీళ్ళల్లో మునిగిపోతే చచ్చిపోతాననే అలా చెప్పాను
on Aug 24, 2024
అగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్స్ ని సాధించిన విషయం అందరకి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఇంద్ర సినిమా అలనాటి విశేషాలు ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర తెరకెక్కగా చిరు సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ చేసారు. ఇక రీ రిలీజ్ సందర్భంగా బి గోపాల్ మాట్లాడుతు చిరంజీవి గారి ఎంట్రీ సీన్ ని గంగానది లో ఫిక్స్ చేసాం.గవర్నర్ కూతురు హోదాలో సోనాలి బింద్రే గంగా నదిలో మునగ గానే చిరంజీవి గారు నదిలో నుంచి పైకి లేస్తారు. పైగా సోనాలి మెడలోని ఒక మాల చిరంజీవి గారి మెడలో పడుతుంది. కథ కి చాలా కీలకమైన సీన్ కూడా. కానీ సోనాలి మాత్రం నదిలో మునగనంది. నీళ్ళల్లో మునిగితే చచ్చిపోతానని నా నమ్మకం. మీరెన్ని చెప్పినా కూడా మునగనని అంది. దీంతో ఆమెకి సీన్ అవసరాన్ని వివరించి మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు అని ఆమె చుట్టూ కొంత మంది మనుషులని ఫిక్స్ చేసి గంగా నదిలో మునిగేలా చేసాం అని చెప్పుకొచ్చారు. చిరు అభిమానులని, సినీ ప్రేమికులని ఈ మాటలు ఎంతోగానో ఆకర్షిస్తున్నాయి.
Also Read