సుశాంత్ సింగ్ ప్లేస్లో 'అంధాధున్' హీరో!
on Oct 28, 2020
అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేయతలపెట్టిన 'చండీగఢ్ కరే ఆషికి' సినిమాలో హీరోగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించాల్సి ఉంది. ఆ ఇద్దరూ కలిసి పనిచేసిన 'కేదార్నాథ్' సినిమా షూటింగ్ పూర్తయినప్పట్నుంచే వాళ్లు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా జూన్ 14న సుశాంత్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి 'అంధాధున్' స్టార్ ఆయుష్మాన్ ఖురానా వచ్చాడు.
అభిషేక్ కపూర్, సుశాంత్ సింగ్ అనుబంధం ఆసక్తికరమైంది. బిహారీ అయిన సుశాంత్ను 'కై పో చే' సినిమాతో బాలీవుడ్కు పరిచయం చేసింది అభిషేకే. ఆ తర్వాత 'ఫితూర్' మూవీని కూడా సుశాంత్తోటే చేయాలనుకున్నాడు అభిషేక్. కానీ సుశాంత్కు ఆ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో, ఆదిత్య రాయ్ కపూర్తో ఆ సినిమా చేశాడు అభిషేక్. సుశాంత్ అభిప్రాయమే నిజమై, 'ఫితూర్' డిజాస్టర్ అయ్యింది. దాంతో సుశాంత్ జడ్జ్మెంట్పై నమ్మకం పెట్టి, 'కేదార్నాథ్' స్క్రిప్ట్ వినిపించాడు అభిషేక్. అది నచ్చి చేశాడు సుశాంత్. నిజంగానే అది ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యింది.
ఇప్పుడు 'చండీగఢ్ కరే ఆషికి' సబ్జెక్ట్ తనకు యాప్ట్ అని ఆయుష్మాన్ ఖురానా విశ్వసిస్తున్నాడు. అతడు చండీగఢ్ నుంచే వచ్చాడు మరి. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ ప్రాజెక్ట్ను ఉత్సాహంతో అనౌన్స్ చేశాడు ఆయుష్మాన్. హీరోయిన్ వాణీ కపూర్, అభిషేక్ కపూర్తో ఉన్న పిక్చర్ను షేర్ చేసిన అతను, "తొలిసారి నా తదుపరి సినిమా తదుపరి స్టాప్ నా సొంత పట్నం చండీగఢ్లో. అభిషేక్ కపూర్ ప్రోగ్రెసివ్ లవ్ స్టోరీ 'చండీగఢ్ కరే ఆషికి'లో భాగం కావడం ఆనందంగా ఉంది. నాతో వాణీ కపూర్ నటిస్తోన్న ఈ మూవీని భూషణ్ కుమార్, ప్రగ్యా కపూర్ నిర్మిస్తున్నారు" అని అతను రాసుకొచ్చాడు.
Also Read