'కప్పేలా' రీమేక్ లో అజిత్ సిల్వర్ స్క్రీన్ డాటర్
on Nov 25, 2020
మలయాళ చిత్రం 'కప్పేలా'.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో కథానాయిక పాత్ర కోసం అనిఖ సురేందర్ ని ఎంపిక చేశారని టాక్. కోలీవుడ్ స్టార్ అజిత్ కథానాయకుడిగా నటించిన 'ఎన్నై అరిందాల్' (తెలుగులో 'ఎంతవాడు గానీ'), 'విశ్వాసం' చిత్రాల్లో కూతురి పాత్రల్లో అనిఖ దర్శనమిచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడీ టీనేజ్ బ్యూటీ 'కప్పేలా' రీమేక్ తో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం తొలుత 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి పేరు వినిపించింది. అయితే పారితోషికం భారీగా డిమాండ్ చేయడంతో అనిఖ వైపు మొగ్గు చూపిందట యూనిట్. త్వరలోనే అనిఖ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా ఈ రీమేక్ లో మేక వన్నె పులి లాంటి పాత్రలో నవీన్ చంద్ర నటించనుండగా.. మరో కథానాయకుడిగా విశ్వక్ సేన్ నటించబోతున్నాడని టాక్.