ENGLISH | TELUGU  

కన్నడలో 'పుష్ప-2' కలెక్షన్ల రచ్చ.. మరీ ఇంత దారుణమా..!

on Jan 28, 2025

 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప-2' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ వసూళ్లపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఐటీ రైడ్స్ జరిగినప్పటి నుంచి ఈ చర్చలు మరింత పెరిగాయి. (Pushpa 2 Collections)

 

ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలు నిర్మాణ సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉంది. ఐటీ రైడ్స్ జరిగినప్పటి నుంచి పుష్ప-2 కలెక్షన్ల అసలు లెక్క తేలిందంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వచ్చిన కలెక్షన్స్ ని మేకర్స్ రూ.500 కోట్లు తక్కువ చేసి చూపించారని, నిజానికి 'పుష్ప-2' రూ.2300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం.. వచ్చిన కలెక్షన్స్ కి రూ.500 కోట్లు ఎక్కువ చేసి చూపించారని, నిజానికి వచ్చింది రూ.1300 కోట్ల లోపే అని కామెంట్స్ చేస్తున్నారు. (Pushpa 2 The Rule)

 

 

అయితే ఈ 'పుష్ప-2' కలెక్షన్ల చర్చ కన్నడలో కూడా జరుగుతోంది. అక్కడి మీడియా, సోషల్ మీడియాలో 'పుష్ప-2' కలెక్షన్స్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. ఐటీ రైడ్స్ తో ఈ ఫేక్ భాగోతం బయటపడిందని చెబుతున్నారు. అలాగే ఒరిజినల్ గా 'కేజీఎఫ్-2' కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయంటూ ట్రోల్ చేస్తున్నారు. 'కేజీఎఫ్-2' రూ.1250 కోట్లు కలెక్ట్ చేస్తే.. 'పుష్ప-2' రూ.1200 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, కానీ రూ.1800 కోట్లు అంటూ ఫేక్ చేశారని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ ని తిప్పికొడుతున్నారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.