మహేష్ మూవీలో అక్కినేని హీరో!!
on May 14, 2021
అతడు, ఖలేజా తర్వాత దాదాపు 11 ఏళ్ళకి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే, జాన్వీ కపూర్ ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు హీరో సుమంత్ ని తీసుకోవాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’లో హీరో సుశాంత్ ఓ కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ తన తరువాతి సినిమా కోసం అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో సుమంత్ ని తీసుకోవాలనుకుంటున్నారని న్యూస్ రావడం హాట్ టాపిక్ గా మారింది.
అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని సంప్రదించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే 20 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. 2001లో బాలకృష్ణ నటించిన ‘భలేవాడివి బాసూ’ సినిమా తర్వాత శిల్పా శెట్టి తెలుగులో మరో సినిమా చేయలేదు.