అడవుల్లో రమా సమేత రాజమౌళి...
on Sep 18, 2020
తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడిన రాముడు... తన అర్ధాంగి సీతను తీసుకుని అడవులకు వెళతారు. అది రామాయణంలో! నేటి భారతంలో అర్థాంగి రమాని తీసుకుని రాజమౌళి కూడా అడవులకు వెళ్ళారు. తండ్రి ఇచ్చిన మాట కోసమో... ఇంకో దాని కోసమో రాజమౌళి అడవికి వెళ్ళలేదు. సరదాగా శ్రీమతితో జాలీగా ట్రిప్ వేశారు. కర్ణాటకలోని బండిపూర్ నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్లారు. రాజమౌళి దంపతులకు ఐఎఫ్ఎస్ అధికారి బాలచంద్ర మంగళవారం నాడు మూడు గంటల పాటు దగ్గరుండి అడవిని చూపించారు. మూడు రోజులు హాలిడే ట్రిప్ కోసం రాజమౌళి, రమా రాజమౌళి కర్ణాటక వెళ్లినట్లు తెలుస్తోంది.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చూడడానికి ముందు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ తాలూకాలోని himavad gopalaswamy ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని కర్ణాటక అటవీ అధికార వర్గాల నుండి అందిన సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్రానికి ముందు కాలంలో జరిగే కథతో ఆయన సినిమా రూపొందిస్తున్నారు. ఒకవేళ సినిమాలో అటవీ నేపథ్యంలో సన్నివేశాల చిత్రీకరణ కోసం కర్ణాటక అడవులను సందర్శించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read