ఆ కేసు నుంచి షారుఖ్ ఖాన్కు ఊరట
on Jun 20, 2014

బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ సెరగేటరీ ద్వారా మూడవ సంతానాన్ని పొందిన క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వాహించారని ఆరోపణలు వచ్చాయి. సామాజిక కార్యకర్త వర్షాదేశ్ పాండే షారుఖ్ ఖాన్ దంపుతులపై కేసు ఫైలు చేశారు. ఈ కేసులో వీరికి ఊరట లభించినట్లు తెలుస్తోంది. గురువారం ముంబాయి హైకోర్టు ఈ కేసును తోసిపుచ్చింది. కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. వారి మూడో సంతానం విషయంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఈ దంపతులు ప్రయత్నించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులతో కేసు నుంచి బయటపడిన షారుఖ్, గౌరీలు సంతోషం వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



