రకుల్ రిజెక్ట్ చేసింది... రష్మిక స్టార్ అయ్యింది!
on Nov 20, 2019
తెలుగులో రష్మిక మందన్నాకు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా 'గీత గోవిందం'. నిజానికి, ఆ సినిమాలో కథానాయిక పాత్రలో నటించమని దర్శకుడు పరశురామ్ పలువురు అగ్ర నాయికలను సంప్రదించారు. అప్పటికి, 'అర్జున్ రెడ్డి' విడుదల కాలేదు. విజయ్ దేవరకొండ స్టార్ కాదు. అందుకని, అతడి పక్కన నటించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. 'గీత గోవిందం' విడుదల సమయంలో రష్మిక కంటే ముందు ఎవరెవరిని సంప్రదించారని దర్శకుడు పరశురామ్ ను అడిగితే... 'ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు?' అని సమాధానం దాటవేశారు.
అతడు సంప్రదించిన కథానాయకులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ సంగతిని తాజాగా ఆమె బయట పెట్టింది. హిందీలో 'దే దే ప్యార్ దే'కు సంతకం చేయడం వల్ల 'గీత గోవిందం' చేయలేక పోయానని తాజాగా రకుల్ వెల్లడించారు. రెండు సినిమాల షెడ్యూల్స్ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'గీత గోవిందం' వదులుకున్నానని ఆమె తెలిపారు. రకుల్ రిజక్ట్ చేయడంతో ఆ అవకాశం రష్మికకు వచ్చింది. ఆమె స్టార్ అయ్యారు. ఈ విధంగా రకుల్ వదులుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.