గోపీతో రకుల్ రొమాన్స్ కు సిద్ధం
on Mar 28, 2014
"లక్ష్యం" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్ లో మరో కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో మొదలుకానుంది. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేసారు. ఈ తాజా చిత్రం కోసం శ్రీవాస్ ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేసాడని తెలిసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.