బన్నీ, అజిత్తో రాజమౌళి మల్టీస్టారర్??
on Aug 6, 2015
టాలీవుడ్కి ఇది దిమ్మతిరిగిపోయే న్యూస్ ఇది. బాహుబలి 2 తరవాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంలో దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. ఈసారి రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేయడానికి స్కెచ్ వేస్తున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే ఈ చిత్రంలో కథానాయకులుగా అల్లు అర్జున్, అజిత్లను ఎంచుకొన్నాడట.
విజయేంద్రప్రసాద్ రాసిన కథ ఇద్దరు హీరోల్ని డిమాండ్ చేస్తోందని టాక్. తెలుగులో బన్నీ, తమిళంలో అజిత్ ల వల్ల ఈ సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరుగుతుందని రాజమౌళి ప్లాన్. సెప్టెంబరులో బాహుబలి 2 మొదలువుతుంది. 2016 వేసవిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తరవాత ఈ మల్టీస్టారర్ ని సెట్స్పైకి తీసుకెళ్తారని టాక్.