కేజియఫ్ దర్శకుడితో ప్రభాస్!!
on Jan 3, 2019
ప్రభాస్ `బాహుబలి` సిరీస్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో `సాహో` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసందే. రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగస్ట్ లో రిలీచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు `సాహో ` సినిమా చేస్తూనే మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తైంది. ఈ మూవీకి `అమూర్` లేదా `జాన్` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇటలీలో పూర్తైంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలై తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించిన `కేజియఫ్` చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఇప్పటికే ప్రభాస్ చర్చలు జరిపినట్లు సినిమా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ లో నే ఈ సినిమా రూపొందనుందట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయని సమాచారం.