పవన్ మూవీలో నిత్యామీనన్.. అధికారిక ప్రకటన
on Jul 30, 2021
మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటించనున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్.. భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పొలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఆమెకి వెల్ కమ్ చెబుతూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు నిత్యామీనన్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ రోజు నుంచి పవన్, నిత్యా కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించనున్నారట.
ఇక ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Also Read