హైందవ ధర్మాన్ని అవమానించి పరారీలో వున్న నిర్మాతలు?
on Apr 28, 2017
మన హైందవ ధర్మాన్ని ఇంత ఘోరంగా అవమానించేలా సినిమా తీసిన ఆ నిర్మాతలు ఇప్పుడు పరారీలో ఉన్నారని మీకు తెలుసా..?
మన మానవ సమాజం లో మనిషి బలంగా నమ్మే ఓకే నమ్మకం దైవం, ఒక ధర్మం న్యాయం, ఒక వ్యవస్థ రాజకీయం, ఒక ధృడ నిచ్చయం మతం. ప్రతి మనిషి తన మతాన్ని, ఆ మతం వెనక దైవాన్ని గొప్పగా కొలుస్తాడు, విలువలతో చూస్తాడు.. ఆ మనుషుల విలువలను, మన మతాల ఆచారాలను ఆగౌరవ పరుస్తూ మన నమ్మకాలను తుంగలో తొక్కే విధంగా ఆ సినిమాను తెరకెక్కించిన నిర్మాతలకు ఇప్పుడు ఏటు పరారై తల దాచుకోవాలో కూడా అర్ధం కావటం లేదంటా…!
అసలు ఇంతకి ఏంటి ఆ సినిమా..? ఏవరు ఆ నిర్మాత? ఏంటి ఆ కథ? అనే కదా మీ సందేహం.!
ధ్రువ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ రాజేశ్వరి సమర్పణ లో ధ్రువ కుమార్ నిర్మాతగా శివమణి రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘’నాకు నేనే తోపు తురుమ్.’’ ఈ సినిమా ఇప్పుడు హిందు ధర్మ సంఘాల మధ్య వివాదాస్పదం అయింది. ఏదైనా విరుద్దంగా, వ్యతిరేఖంగా చేస్తేనే మనల్ని ఈ సమాజం గుర్తిస్తది అని ఆ నిర్మాతలు భావించారేమో ఏంటో కాని, ఈ సినిమాను మాత్రం దైవ, న్యాయ ధర్మాది విలువలను కించపరుస్తూ తెరకెక్కిన సన్నివేశాలు మతాల పట్ల గొడవలు పెట్టే విధంగా ఉన్నాయంటా. ఏ మాత్రం సమాజం పట్ల, దేశం పట్ల, మన సనాతన విలువల పట్ల అస్సలు గౌరవం లేకుండా ఈ దర్శక నిర్మాతలు తెరకెక్కించిన ఈ ‘నాకు నేను తోపు తోరుమ్’ అనే సినిమా ఇప్పుడు, అసలు ఇంత కటినంగా దర్శకుడు ఎంచుకున్న కథ ఏంటి అని ప్రతి చోట వివాధాలతోనే దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకుంది.
హిందూ మతాల దేవుళ్ళ చిత్ర పటాలు తగలబెడుతూ, న్యాయ వ్యవస్తను తిడుతూ, మన ధర్మాలను ఆగౌరవ పరుస్తూ ఈ సినిమాలు తెరకెక్కించిన సీన్లే ఈ సినిమా నిర్మాతలు ఇప్పుడు పారిపోవటానికి ముఖ్య కారణం కూడా అదే. పైగా ఇటువంటి సినిమాలో జబర్దస్త్ టీం తో పాటు, మంచి వైవిధ్యమైన నటులు, తెలుగు స్టార్ యాక్టర్స్ సైతం నటించారంటే ఈ కథలో ఏ స్థాయిలో దమ్ము ఉండాలి అని క్రిటిక్స్ సైతం కూడా ఆచర్యపోతున్నారంటా…! కాని, కొందరు సినీ మేధావులు మాత్రం ఈ సినిమా గురించి గొప్పగానే మాట్లాడుతున్నారంటా… మన సమాజ ప్రస్తుత పరిస్తితి ఇదే కదా, ఈ నీచమైన పరిస్తితిని ఈ నిర్మాత ఏవరో మన కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడు అని విశ్లేస్తున్నారు అని ఫిలింనగర్ టాక్.
అసలు దర్శకుడు ఈ ధృక్పదంతోనే ఏందుకు ఈ కథ ఏంచుకున్నాడు, ఆ కథను ఇలా మరల్చి దాని ద్వారా మన సమాజానికి సందేశం ఇచ్చాడా..? లేదా తన వంతు మార్పు కోరుకున్నాడా..? విలువలు నాశనం చేసాడా..? న్యాయ వ్యవస్తను ప్రశ్నించాడా..? మతాలను, ధర్మాలను ఏందుకు ఇంత వికృత ధోరణిలో చూపించాడు అని చాలా మందికి సందేహాలు కూడా బలపడ్డాయని టాక్.
ఏది ఏమైనా విడుదల అయిన ఈ ఒక్క ట్రైలర్ తోనే ఈ సినిమా ఇన్ని వివాదాలు, సంచలనాలు సృష్టిస్తే, మరి అసలు పూర్తి సినిమా విడుదల అయిన తరువాత మతాల మధ్య, జ్ఞాన పండితుల మధ్య, విలువల మధ్య ప్రజా న్యాయ వ్యవస్త పై ఏన్ని గొడవలు పెడుతుందో, ఇంకెంత వివాదాస్పదం అవుతుందో తెలియాలంటే ఈ సినిమా గురించి ఏంతో ఆసక్తిగా ఏదురు చూస్తున్న ప్రేక్షకులు సైతం విడుదల తేది వరకు వేచి చూడాల్సిందే.