ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన బెల్లంకొండ
on Aug 25, 2014
నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'రభస' మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాకి ఇంకా పబ్లిసిటీ మొదలుపెట్టకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాతపై మండిపడుతున్నారట. ఈ విషయంపై చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడట బెల్లంకొండ సురేష్. కొత్త హీరో అయితే పబ్లిసిటీ కావాలని కానీ జనాలకు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాలా? అని అడుగుతున్నాడట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురయినట్లు సమాచారం. కొడుకు కోసం చానెళ్లకే ఏడున్నర కోట్లు ఖర్చు పబ్లిసిటీకి ఖర్చు చేసిన బెల్లంకొండ ‘రభస’ పై ఇలా మాట్లాడటం ప్రస్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.