ENGLISH | TELUGU  

ఈనెల 21న యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల 'మఫ్టీ పోలీస్'..!

on Nov 18, 2025

 

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా "తీయవర్ కులై నడుంగ" తెలుగులో "మఫ్టీ పోలీస్"గా  ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని... తెలుగులో "మఫ్టీ పోలీస్" పేరుతో శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ విడుదల చేస్తున్నారు.

 

ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించి ఉండడం గమనార్హం.

 

 

ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ... "యాక్షన్ కింగ్ అర్జున్ - ఐశ్వర్య రాజేష్ లకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో "మఫ్టీ పోలీస్" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్ కుమార్ గారికి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు.

 

రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి శరవణన్ అభిమన్యు సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా భరత్ ఆశీనగన్, ఎడిటర్ గా లారెన్స్ కిషోర్ వ్యవహరించారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.