మిస్టర్ బ్రహ్మ.. ఏంటీ డ్రామా?
on Mar 27, 2023
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. A2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి జి. భవానీ శంకర్ దర్శకుడు. రియా సచ్దేవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా' అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
'మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా' చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్, హీరో మంచు మనోజ్, దర్శకుడు బాబీ కొల్లి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు.
'రాజ్ దూత్'(2019) చిత్రంతో హీరోగా పరిచయమైన మేఘాంశ్.. ఆ తరువాత వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'కోతి కొమ్మచ్చి' అనే చిత్రంలో నటించాడు. ఈ 'మిస్టర్ బ్రహ్మ' సినిమా నటుడిగా అతనికి మూడోది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు.
Also Read