ఓటీటీలోకి 'మార్కెట్ మహాలక్ష్మి'...
on Jul 2, 2024
'కేరింత' ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. విఎస్ ముఖేష్ దర్శకత్వంలో బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మించారు. సాఫ్ట్వేర్ యువకుడికి, మార్కెట్లో కూరగాయలు అమ్మే యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'మార్కెట్ మహాలక్ష్మి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జులై 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి జో ఎన్మవ్ సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా సురేంద్ర చిలుముల, ఎడిటర్ గా ఆర్.ఎం. విశ్వనాధ్ కూచనపల్లి వ్యవహరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
