ఇందిరాగాంధీ బయోపిక్ లో మనీషా కోయిరాలా?
on Jun 21, 2018
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఇందిరా గాంధీ బయోపిక్ అంశం తెరమీదకి వచ్చింది.. సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలా చాలా ఏళ్ళ క్రితమే ఇందిరా గాంధీ బయోపిక్ కోసం సంతకం చేశారట.. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ లు బాగా వస్తున్న నేపథ్యంలో మనీషా తన మనసులో మాట బయటపెట్టారు.. ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని, ఆమె పాత్రలో నటించడం నా చిరకాల కోరిక అని మనీషా అన్నారు.. మరి మనీషా చిరకాల కోరిక ఇందిరాగాంధీ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏంటో.