మహేష్ సరసన మల్లీశ్వరి??
on Jan 4, 2019

కత్తిలాంటి కత్రినా ప్రస్తుతం బాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న నటి. ఆమె తెలుగులో పదమూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. అదీ కూడా ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించనుందట. ఈమె గతంలో తెలుగులో `మల్లీశ్వరి` సినిమాలో వెంకటేష్ సరసన నటించింది . ఆ తర్వాత బాలయ్యతో కూడా ఓ చిత్రంలో నటించింది. ఆ సినిమాల తర్వాత కత్రినా తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. కానీ, ప్రజంట్ తెలుగు సినిమా `బాహుబలి` తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది తెలుగులో నటించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ సరసన సాహో చిత్రంలో శ్రద్ధకపూర్ నటిస్తోంది. ఇక కత్రినా కైఫ్ కూడా సూపర్ స్టార్ మహేష్ సరసన సుకుమార్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో తీసుకోవడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందనేది త్వరలో తెలిసే అవకాశాలున్నాయి. ఇక మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ లో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



