మరిచిపోలేని `పోకిరి`ని ఎలా మరిచిపోయాడు!!
on May 2, 2019
నిన్న హైదరాబాద్లో `మహర్షి` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్ 25వ సినిమా కావడంతో తన కెరీర్ కు ప్లస్ అయిన సినిమాల గురించి, ఆ దర్శకుల గురించి ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. కానీ, మహేష్ ని సూపర్ స్టార్ గా చేసిన `పోకిరి` సినిమా గురించి ఆ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. వాంటెడ్లీ జరిగిందో లేక మరిచిపోయాడో కానీ ..ఫంక్షన్ అయిన అనంతరం మాత్రం ట్విట్టర్ లో `మరిచిపోలేని సినిమా పోకిరి అంటూ పూరికి థన్యవాదలు తెలిపాడు మహేష్. వీరి కలయికలో బిజినెస్ మేన్ కూడా వచ్చింది. ఈ సినిమా కూడా మహేష్ నటనకు మంచి పేరు తెచ్చిన చిత్రమే. ఇలాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన పూరి ని మరిచిపోవడమేంటి అంటూ అటు ప్రేక్షకుల నుంచి ఇటు సినీ పరిశ్రమ నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే వీరి కాంబినేషనల్ `జనగణమన` అనే సినిమా చేయబోతున్నట్లు పూరి ఎనౌన్స్ చేసాడు. కాని ఇంత వరకూ పట్టాలెక్కలేదు. దాని వల్ల ఇద్దరికి మధ్య దూరం ఏమైనా పెరిగిందా అనేది కొంత మంది మాట. అలాగే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమా గురించి `నా కిష్టమైన` సినిమా అంటూ మహేష్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. కానీ సుకుమార్ పేరు కూడా నిన్న జరిగిన ఫంక్షన్ లో చెప్పులేదు. ఈ మధ్య కథ పై ఏకాభ్రిప్రాయం రాకపోవడంతో ఆ సినిమా చేయట్లేదు అంటూ ప్రకటించాడు మహేష్. ఇలా ఇద్దరి పేర్లను చెప్పకపోవడం పై అందరూ చర్చించుకుంటున్నారు.