మధుశాల మూవీ రివ్యూ
on Apr 2, 2025
మూవీ: మధుశాల
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, రఘుబాబు, గెటప్ శ్రీను, మనోజ్ నందం, యానీ, బెనర్జీ, ఇనయా సుల్తానా తదితరులు
మ్యూజిక్: సెబాస్టియన్ వర్గీస్
నిర్మాతలు: పొట్లూరి సత్యనారాయణ
ఎడిటింగ్, దర్శకత్వం: జి. సుధాకర్
ఓటీటీ : ఈటీవీ విన్
కథ:
ఒక గ్రామంలో ఎమ్మెల్యే సత్యనారాయణ (గోపరాజు రమణ) పెత్తనం కొనసాగుతూ ఉంటుంది. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా వెంకట్రావ్ (బెనర్జీ) కూడా ఉంటాడు. సత్యనారాయణ తన కొడుకు ప్రేమించాడని చెప్పి పేదింటి అమ్మాయి పల్లవి (యానీ)ని కోడలిగా తీసుకుని వస్తాడు. ఆయన ఆదర్శాన్ని గురించి అందరు కూడా గొప్పగా చెప్పుకుంటారు. పల్లవి తల్లిదండ్రులు తమ అదృష్టానికి మురిసిపోతారు. అదే గ్రామంలో దుర్గా(మనోజ్ నందం) కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతుంటాడు. రాములు (తనికెళ్ల భరణి) కూతురు 'కనక' (ఇనయా)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఇక ఆ గ్రామానికే అందగత్తెగా అందరు 'మధురవాణి' (వరలక్ష్మి శరత్ కుమార్) పేరు చెబుతుంటారు. ఎలాగైనా ఆమెను పొందాలనే ఉద్దేశంతో రవి 'గెటప్ శ్రీను) ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. పల్లవిని కిడ్నాప్ చేసి ఓ నాలుగు రాజుల పాటు రహస్యంగా ఉంచమని నాయుడమ్మ (రఘుబాబు) చెప్పడంతో 'దుర్గ' అలాగే చేస్తాడు. ఇక ఊళ్ళో వారంతా తనకోసం వెతుకుతుంటారు. దాంతో పల్లవిని చంపేయమని దుర్గకి చెప్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? పల్లవిని చంపించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారనేది మిగతా కథ.
విశ్లేషణ:
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా ఉంది. కామెడీ ఉంది. ప్రేమ కూడా ఉంది. కానీ అవేవీ పర్ఫెక్ట్ గా లేవు. అంటే కూర వండటానికి అన్నీ కూరగాయలు గిన్నెలో వేసి స్టవ్ అంటించడం మర్చిపోయినట్టుగా ఉంటాయి. అంటే రఘుబాబు, తనికెళ్ళ భరణి, వరలక్ష్మి శరత్ కుమార్, బెనర్జీ, గెటప్ శ్రీను ఇలా ఇంతమంది కాస్టింగ్ ఉన్నా ఎవరి దగ్గర నుండి సరైన అవుట్ పుట్ తీసుకోలేకపోయాడు దర్శకుడు.
ఇప్పటికవరకు మన తెలుగు సినిమాల్లో చాలా వరకు ప్రేమ, రాజకీయాలు, కాస్తంత కామెడీ మిక్స్ చేసిన విలేజ్ కథలు ఎన్నో వచ్చాయి. మరి అలాంటి కథతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా అంటే లేదనే చెప్పాలి. పల్లవిని కోడలిగా చేసుకునే సీన్ చూస్తేనే అర్థమవుతుంది. కథ పాయింట్ బాగున్నప్పటికి క్యారెక్టర్ ప్రెజెంటేషన్ లో సీరియస్ నెస్ లేదు. రఘుబాబు పాత్ర అయితే అసలు ఎందుకు ఉందో అర్థం కాదు. ఓ సీన్ చూస్తే.. ఒక వ్యక్తిని మర్డర్ చేయడం ఇంత సింపులా అని అనిపిస్తుంది.
సినిమాలో ఎమ్మెల్యే , మధురవాణి, దుర్గా పాత్రలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. అయితే ఈ మూడు పాత్రలను పవర్ఫుల్ గా మలచలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా మధురవాణి పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన ఆ పాత్ర అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సినిమా మొదలైన అరగంటకే ఎందుకు చూస్తున్నాం రా బాబు అనేలా కథ సాగుతుంది. ఎడిటింగ్ లో చాలా వరకు స్లో సీన్లని కట్ చేసేయొచ్చు కానీ అలానే ఉంచేశారు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఒకే. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు ఒకే.
నటీనటుల పనితీరు:
నాయుడమ్మగా రఘుబాబు, మధురవాణిగా వరలక్ష్మి శరత్ కుమార్, రాములుగా తనికెళ్ళ భరణి, ఎమ్మెల్యేగా గోపరాజు రమణ ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కిక్కు ఇవ్వని మధుశాల.
రేటింగ్ : 1.5/ 5
✍️. దాసరి మల్లేశ్
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
