పిచ్చి పట్టి... పిచ్చి వాగుడు వాగుతున్నాడు!
on Aug 19, 2017
రామ్ గోపాల్ వర్మకు పిచ్చి పట్టిందట! పిచ్చి వాగుడు వాగుతున్నాడట!... ఈ మాటలంది ఎవరో కాదండోయ్... మన మా అధ్యక్షుడు శివాజీ రాజానే. అంత కోపం వర్మపై ఎందుకొచ్చింది ఈయనగారికి? అనేగా మీ ప్రశ్న. డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ లేఖ రాయడం... ప్రభుత్వానికి సెరండర్ అయిపోయినట్లుందని వర్మ చేసిన కామెంట్ పై మీ అభిప్రాయం ఏంటని? ఈ మధ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూ శివాజీరాజాను అడగడం జరిగింది. దానికి శివాజీరాజా తెగ ఇరిటేట్ అయిపోయి... ‘వర్మకు పిచ్చెక్కింది. అందుకే ఈ పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఒకరు కాదు... ఇద్దరు మానసిక వైద్యులకు చూపించాలి అతణ్ని. సినిమాలు లేకపోవడంతో మానస్తాపానికి గురై... ఇలా మతి చలించి పిచ్చివాగుడు వాగుతున్నాడు. వర్మ మంచి దర్శకుడు.ఇకనైనా.. అనవసరపు విషయాలను కాకుండా... సినిమాల గురించి ఆలోచిస్తే మంచిది’అని సమాధానమిచ్చాడు శివాజీరాజా.
అయితే... ఈ వ్యవహారంపై వర్మకే ఎక్కువ సపోర్ట్ లభిస్తున్నట్లు కనిపిస్తుంది. శివాజీరాజా సమాధానంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయ్. పరిశ్రమ రాసిన ఉత్తరంలో ‘ఎవరో కొందరు చేసిన తప్పుకు’అనే మాటను చేర్చడం నిజంగా అభ్యతరకరమే అని చాలామంది అంటున్నారు. ‘తప్పు’ నిరూపణ అవ్వకుండా... ఆ మాట రాయడానికి వారికేం హక్కుందని చాలామంది అంటున్నారు. ‘మేం తప్పు చేశాం ’అని నిందుతుల్లో ఒకరైనా వచ్చి శివాజీరాజాకు చెప్పారా? మరి ఏ ఆధారంతో ఆ మాటను ఉత్తరంలో చేర్చారని వారు ప్రశ్నిస్తున్నారు. రేపు తప్పు చేసినట్టు నిరూపణ కాకపోతే... ఇప్పుడు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు.. రేపు నిందితులకు కూడా క్షమించమని శివాజీరాజా లేఖ రాస్తాడా? అని అడుగుతున్నారు. వారు అడుగుతున్న వాటిలో కూడా నిజం లేకపోలేదు. మరి ఈ ప్రశ్నలకు శివాజీరాజా ఏం సమాధానం చెబుతాడో చూడాలి.