కన్నప్ప సినిమాని ట్రోల్ చేస్తే శివుడు ఊరుకోడు!
on Mar 24, 2025
ఈ సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. స్టార్స్ సైతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోల్స్ పై తాజాగా కన్నప్ప టీం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. (Kannappa)
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు రఘబాబు.. ట్రోలర్స్ పై ఊహించని వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్ మీట్ లో ట్రోల్స్ కి సంబంధించిన ప్రశ్న మంచు విష్ణుకి ఎదురైంది. దీనికి విష్ణు బదులిస్తూ.. కొందరు కావాలని కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తుంటారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదే సమయంలో పక్కనున్న రఘుబాబు మైక్ అందుకొని "కన్నప్ప సినిమాని ఎవరైనా ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి, శాపానికి గురవుతారు." అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
